గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడు దుర్మరణం

by Sridhar Babu |
గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడు దుర్మరణం
X

దిశ, వైరా : వైరా మండలంలోని స్టేజి పినపాక గ్రామ సమీపంలో భారత్ పెట్రోల్ బంక్ ఎదురుగా జాతీయ ప్రధాన రహదారిపై మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం చెందాడు. ఈ ప్రమాదంలో తల్లాడ మండలం అన్నారుగూడెం గ్రామానికి చెందిన రామ శెట్టి నాగార్జున (30) అక్కడికక్కడే మృతి చెందాడు. వైరా నుంచి తన స్వగ్రామమైన తల్లాడ

మండలంలోని అన్నారుగూడెంకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న నాగార్జున రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఆయన ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. ఈ ప్రమాద విషయం తెలుసుకున్న ఎస్ఐ మేడా ప్రసాద్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి పూర్తి వివరాలు సేకరించారు. వైరా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



Next Story