తండ్రి మందలించాడని యువకుడు ఆత్మహత్య

by Sridhar Babu |
తండ్రి  మందలించాడని యువకుడు ఆత్మహత్య
X

దిశ,తిరుమలాయపాలెం : తండ్రి మందలించాడని ఓ యువకుడు గడ్డి మందు తాగి చికిత్స పొందుతూ శనివారం మరణించాడు. అందుకు సంబం ధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని హైదర్ సాయిపేట గ్రామానికి చెందిన గుగులోత్ విష్ణు అనే యువకుడు శ్రీ చేతన్య కళాశాలలో ఇంటర్ ప్రథమ సవంత్సరం చదువుతున్నాడు.

విష్ణు కళాశాలకు వెళ్లడం లేదని తండ్రి కృష్ణ మందలించాడు. దీంతో మనస్తాపానికి గురై విష్ణు, గత సోమవారం ఇంట్లో గడ్డి మందు తాగి చికిత్స పొందుతూ శనివారం మరణించాడు. ఈ మేరకు ఆదివారం మృతుడు తండ్రి కృష్ణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.



Next Story

Most Viewed