మద్యం మత్తులో యువకుడు ఆత్మహత్య

by Sridhar Babu |
మద్యం మత్తులో యువకుడు ఆత్మహత్య
X

దిశ సత్తుపల్లి : సత్తుపల్లి పట్టణ పరిధిలోని రాజీవ్ నగర్ కాలనీకి చెందిన చాగల రవీంద్ర (35) ఏలూరు లో మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నారు. ఇటీవల భార్య భర్తల మధ్య గొడవల కారణంగా అతనిపై ఆయన భార్య జ్యోతి గృహహింస చట్టం కింద కేసు నమోదు చేయగా మనస్థాపం చెంది రవీంద్ర బుధవారం మద్యం మత్తులో గౌరి గూడెం గ్రామం శివారులో తమ్మిలేరులో పడి మృతి చెందాడు. ఈమేరకు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వగా స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడికి భార్యతో పాటు కుమార్తె, కుమారుడు ఉన్నారు.



Next Story

Most Viewed