- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
అప్పుల బాధతో యువ రైతు ఆత్మహత్యాయత్నం

దిశ,తిరుమలాయపాలెం : ఆరుగాలం కష్టపడి పండించిన మిరప తోట రోగాల బారిన పడగా, పంట పెట్టుబడి కోసం తెచ్చిన అప్పులు తీర్చలేనేమో అని యువరైతు ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన గురువారం మండలంలో వెలుగు చూసింది. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తిరుమలాయపాలెం మండలంలోని కాకరవాయి గ్రామానికి చెందిన బోడపట్ల గణేశ్ (22) తనకున్న అరెకరంతో పాటు, అదే గ్రామానికి చెందిన ఓ..రైతు వద్ద సుమారు రెండు ఎకరాల వ్యవసాయ భూమి కౌలుకు తీసుకున్నాడు.
అందులో ఎకరంన్నర మిర్చి పంట సాగు చేయగా, అరెకరం పొలం వేశాడు. భారీగా పెట్టుపడి పెట్టి సాగు చేసిన మిరప తోట రోగం బారిన పడి దిగుబడి రాకుండానే ఎండిపోయింది. చెల్లి పెండ్లీ సమీపిస్తుండడంతో ఇప్పటికే అప్పులపాలై.. పెట్టుబడి కోసం తెచ్చిన అప్పులు తీర్చలేక మనస్థాపానికి గురైన గణేశ్ గురువారం అదే చేను వద్దకు వెళ్లి గడ్డి ముందు తాగాడు. గమనించిన స్థానికులు హుటాహుటిన 108 అంబులెన్స్ ద్వారా ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. మూడు రోజులు గడిస్తే కానీ గణేశ్ ఆరోగ్యం విషయం చెప్పలేమని వైద్యులు తెలిపారని కుటుంబసభ్యులు పేర్కొన్నారు.