రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

by Sridhar Babu |
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
X

దిశ,కల్లూరు : పట్టణ ప్రధాన రహదారిపై శుక్రవారం ఉదయం 6 గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో గ్రామపంచాయతీ కార్మికురాలు కాకాటి ధనమ్మ మరణించారు. గ్రామపంచాయతీ శానిటేషన్ సిబ్బందిగా రోజువారిగా నిర్వహించే విధుల్లో భాగంగా పట్టణంలోని ప్రధాన రహదారి వెంట చెత్తను సేకరిస్తూ రోడ్డు దాటుతున్న క్రమంలో వేగంగా వస్తున్న కారు అతివేగంగా వచ్చి ఢీకొట్టడంతో ఆమె తలకు బలమైన గాయాలయ్యాయి. దాంతో పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స నిర్వహించి 108 వాహనం ద్వారా మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలిస్తుండగా ఆమె మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. ఈ సంఘటన విషయమై కల్లూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.



Next Story