- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
by Sridhar Babu |

X
దిశ, ములకలపల్లి : రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిన ఘటన శుక్రవారం సాయంత్రం జరిగింది. స్థానికులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆనందపురం గ్రామానికి చెందిన సోయం నాగరత్నం(40) తన కుమారుడితో కలిసి బైక్పై బంధువుల పెళ్లికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో పాల్వంచ నుంచి ములకలపల్లి వైపు వస్తున్న లారీ ఢీకొట్టింది. దాంతో లారీ కిందపడి నాగరత్నం మృతి చెందింది. బైక్ పై ఉన్న కుమారుడికి స్వల్ప గాయాలు కాగా పాల్వంచ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. భర్త రాములు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి కి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు.
Next Story