రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

by Sridhar Babu |
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
X

దిశ, ములకలపల్లి : రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిన ఘటన శుక్రవారం సాయంత్రం జరిగింది. స్థానికులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆనందపురం గ్రామానికి చెందిన సోయం నాగరత్నం(40) తన కుమారుడితో కలిసి బైక్​పై బంధువుల పెళ్లికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో పాల్వంచ నుంచి ములకలపల్లి వైపు వస్తున్న లారీ ఢీకొట్టింది. దాంతో లారీ కిందపడి నాగరత్నం మృతి చెందింది. బైక్ పై ఉన్న కుమారుడికి స్వల్ప గాయాలు కాగా పాల్వంచ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. భర్త రాములు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి కి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు.



Next Story

Most Viewed