భర్తను హతమార్చిన భార్య

by Disha Web Desk 1 |
భర్తను హతమార్చిన భార్య
X

పద్ధతి మార్చుకొమ్మని అన్నందుకు కాళ్లు కట్టేసి గొంతు నులిమి హత్య

దిశ, పేట్ బషీరాబాద్: పద్ధతి మార్చుకొమ్మని హెచ్చరించిన భర్తను భార్య కిరాతకంగా హత్య చేసిన ఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జీడిమెట్ల సంజయ్ గాంధీ నగర్ కు చెందిన సురేష్ (28) భార్యా, పిల్లలతో కలిసి ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. భార్య రేణుక వివాహేతర సంబంధం కొనసాగిస్తుందని తెలిసి భర్త సురేష్ రేణుకను పలుమార్లు హెచ్చరించాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఫుల్ గా మద్యం తాగి, భార్య రేణుకకు కల్లును తాగించి మత్తులో పడుకున్నాడు. ఇదే అదనుగా భావించి భార్య రేణుకు తన స్నేహితురాలు దేవితో కలిసి ముందుగా సురేష్ కాళ్లు కటేశారు. అనంతర గొంతు నోమిలి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశారు. ఆ తరువాత మృతదేహాన్ని ఓ ప్లాస్టిక్ బ్యాగులో ఉంచి ఇంటి ఎదుట పార్క్ చేసి ఉన్న ఆటోలో పెట్టి పడుకున్నారు. సోమవారం తెల్లవారుజామున ఇంటి సమీపంలో ఉన్న స్థానికులు ఆటోలో మృతదేహం ఉందని చెప్పడంతో రేణుక ఆటోను నేరుగా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లింది. రాత్రి స్నాక్స్ తీసుకొస్తానంటూ సురేష్ బయటకు వెళ్లాడని.. ఎంతసేపటికీ తిరిగి రాలేదని కథ అల్లింది. దీంతో పోలీసులకు అనుమానం వచ్చి విచారించగా తన హత్య చేశానని ఒప్పుకోవడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Next Story

Most Viewed