మూడెకరాల పామాయిల్ తోట దగ్ధం

by Sridhar Babu |
మూడెకరాల పామాయిల్ తోట దగ్ధం
X

దిశ, దమ్మపేట : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో పామాయిల్ తోటల్లో వరుస అగ్ని ప్రమాదాలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. గురువారం పట్వారి గూడెం గ్రామంలో రాజారావుకు చెందిన నాలుగు ఎకరాల పామాయిల్ తోట షార్ట్ సర్క్యూట్ కారణంగా దగ్ధం అవ్వగా, శుక్రవారం మల్లారం గ్రామంలో దమ్మపేటకు చెందిన కోట వెంకటేశ్వరరావు, రాజీవ్ అనే రైతులకు చెందిన మూడు ఎకరాల చేతికి అందివచ్చిన పామాయిల్ తోట పూర్తిగా దగ్ధమైంది. పామాయిల్ తోట శివారులో గుర్తు తెలియని వ్యక్తులు రోడ్డు వెంట నిప్పు అంటించడంతో ఆ మంటలు తోటలోకి రావడంతో తోట పూర్తిగా దగ్ధమైంది. అగ్ని ప్రమాదంలో 150 పామయిల్ చెట్లు, డ్రిప్పు కాలిపోయాయి. సుమారు 2 లక్షలు రూపాయలు నష్టం వాటిల్లినట్టు రైతులు వాపోయారు.



Next Story

Most Viewed