ఇద్దరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు

by Sridhar Babu |
ఇద్దరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు
X

దిశ,తిరుమలాయపాలెం : కౌలు రైతును కులం పేరుతో దూషించినందుకు మంగళవారం తిరుమలాయపాలెం పోలీస్ స్టేషన్లో ఇద్దరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని తెట్టేలాపాడు గ్రామానికి చెందిన పేరాల లక్ష్మయ్య అనే కౌలు రైతు, తాళ్లచెర్వు గ్రామానికి చెందిన దొంతనబోయిన సత్యనారాయణ వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకొని పంట సాగు చేస్తున్నాడు. సత్యనారాయణ సోదరులైన పూర్ణయ్య, భవాని అనే ఇద్దరు వ్యక్తులు గతనెల 2వ తారీఖున లక్ష్మయ్య సాగు చేస్తున్న పంటను దున్ని చెడగొట్టటమే కాక, కులం పేరుతో దూషించారని బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్సై వారాల శ్రీనివాస్ తెలిపారు.



Next Story

Most Viewed