ఎమ్మెల్యే కాళ్లు మొక్కిన ఆశ్రమ పాఠశాల కార్మికులు

by samatah |
ఎమ్మెల్యే కాళ్లు మొక్కిన ఆశ్రమ పాఠశాల కార్మికులు
X

దిశ, దమ్మపేట : రాష్ట్రవ్యాప్తంగా ఆశ్రమ పాఠశాలలో, ప్రభుత్వ వసతి గృహాల్లో పనిచేస్తున్న దినసరి గత నెల రోజులుగా కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చేస్తున్న దీక్ష తెలిసిందే, అయితే శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట రెవెన్యూ కార్యాలయంలో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేసిన అనంతరం ఆశ్రమ పాఠశాల దినసరి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే వివరించడానికి వచ్చారు. ఈ సందర్భంగా దినసరి కార్మికులు ఎమ్మెల్యే కాళ్లు మొక్కి తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్యలు పరిష్కరించే విధంగా చూడాలని కోరారు, దీంతో ఎమ్మెల్యే వెంటనే ఆశ్రమ పాఠశాలలలో, ప్రభుత్వ వసతి గృహాల్లో పనిచేస్తున్న దినసరి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు తనకు తెలుసని, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరించే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు.



Next Story

Most Viewed