- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
పోలీసులకు తృటిలో తప్పిన పెను ప్రమాదం.. ప్రెషర్ బాంబుకు ఆవు బలి

దిశ, భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్ప అటవీ ప్రాంతంలో కూంబింగ్ పోలీసులను చంపడం కోసం మావోయిస్టులు అడవిలో అమర్చిన ప్రెషర్ కుక్కర్ బాంబు తొక్కి ఓ మూగజీవం (ఆవు) బలైంది. మరో మూగజీవం గాయాలపాలైంది. అడవికి మేతకు వెళ్ళిన పశువుల మందలో ఓ ఆవు ప్రెషర్ బాంబు తొక్కడంతో అది పేలింది. ఈ ప్రమాదంలో ఒక ఆవు మరణించగా మరో ఆవు గాయపడినట్లు చర్ల సీఐ బి. అశోక్ తెలిపారు.
పోలీసుల స్పెషల్ క్యాంపుకి సమీపంలో నిత్యం భద్రతా బలగాలు సంచరించే ప్రాంతంలో ప్రెషర్ బాంబు పేలడంతో పోలీసులు అప్రమత్తమై ఆచితూచి అడుగులు వేస్తున్నారు. నక్సల్స్ గాలింపు కోసం అడవుల్లోకి వచ్చే పోలీసులను హతమార్చడం కోసం మావోయిస్టులు బూబీ ట్రాప్స్, ప్రెషర్ బాంబుల వంటివి అమర్చడం చర్ల అడవుల్లో పరిపాటిగా మారింది. పోలీసులు తీసుకుంటున్న అత్యంత జాగ్రత్తల వలన వారు ప్రమాదం నుంచి తప్పించుకొంటుండగా, అడవిలోకి వెళ్ళే ఆదివాసీలు, పశువుల కాపరులు, మేతకు వెళ్ళిన పశువులు గాయపడిన సందర్భాలు అనేకం ఉన్నాయి.