కోడిపందాల స్థావరంపై పోలీసుల దాడి

by Sridhar Babu |
కోడిపందాల స్థావరంపై పోలీసుల దాడి
X

దిశ, అశ్వారావుపేట : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో భారీ స్థాయిలో నిర్వహిస్తున్న కోడిపందాల స్థావరంపై పోలీసులు దాడి చేశారు. దాడిలో పెద్ద మొత్తంలో నగదు, భారీ వాహనాలు పట్టుబడ్డాయి. కన్నాయిగూడెం గ్రామ శివారులో కోడి పందాలు నిర్వహిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్సై బి.రాజేష్ కుమార్ తన సిబ్బందితో దాడులు నిర్వహించారు. ఈ దాడిలో రూ.1,63,960 నగదు, 3 కార్లు, 2 ద్విచక్ర వాహనాలు, 3 కోడి పుంజులు, 2 కోడి కత్తులను స్వాధీనం చేసుకొని ఏడుగురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు.



Next Story

Most Viewed