రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి

by Sridhar Babu |
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి
X

దిశ, వైరా : వైరా మండలంలోని రెబ్బవరం గ్రామంలో బుధవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న ఏన్కూరు మండలం బురదరాఘవాపురం గ్రామానికి చెందిన మెడి లాలయ్య(28) మృతి చెందాడు. రెబ్బవరం గ్రామ శివారులో బుధవారం అర్ధరాత్రి ద్విచక్ర వాహనాన్ని టాటా ఏసీ వాహనం ఢీకొనటంతో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు మెడి లాలయ్య తీవ్రంగా గాయపడ్డాడు. అతను ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. మృతుడికి భార్య, మూడేళ్ల పాప, ఏడాదిన్నర బాబు ఉన్నారు. వైరా పోలీసులు కేసు నమోదు చేశారు.



Next Story

Most Viewed