చేపల వేటకు వెళ్లి వ్యక్తి గల్లంతు

by Disha Web Desk 1 |
చేపల వేటకు వెళ్లి వ్యక్తి గల్లంతు
X

దిశ, శామీర్ పేట: చేపల వేటకు వెళ్లి వ్యక్తి గల్లంతైన ఘటన శామీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సింకింద్రాబాద్ లోని అంబర్ నగర్ పార్సిగుట్ట కి చెందిన జహంగీర్ (45) మెస్త్రీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. సోమవారం సాయంత్రం జహంగీర్ సరదాగా స్నేహితులతో కలిసి శామీర్ పేట పెద్ద చెరువు వద్దకు చేపలు పట్టేందుకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు జహంగీర్ చెరువులో పడిపోయాడు. దీంతో అతని సోదరుడు షేక్ షాబుద్దీన్ తోటి మిత్రులైన శ్యామ్ రాజు, ఖరీఫ్ సద్దాం చెరువులో దూకి కాపాడేందుకు ప్రయత్నించినా.. ఫలితం లేకపోవడంతో వారు స్థానికుల సమాచారం అందజేశారు. పోలీసులు గజ ఈతగాళ్లతో మృతదేహం కోసం వెతికినా ఆచూకి లభించలేదు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


Next Story

Most Viewed