రైలునుంచి జారిపడి వ్యక్తి మృతి

by Sridhar Babu |
రైలునుంచి జారిపడి వ్యక్తి మృతి
X

దిశ, ఖమ్మం రూరల్​ : రైలు నుంచి జారిపడి ఓ వ్యక్తి మరణించిన సంఘటన చోటు చేసుకుంది. డోర్నకల్లు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాపటపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో ఒక గుర్తు తెలియని మగ మనిషి రైలు నుంచి జారిపడి అక్కడిక్కడే మరణించాడు. మృతుని తల వెంట్రుకలు నలుపుగా ఉండి, ఒంటి పైన నలుపు రంగు షర్టు కి అడ్డం నిలువు తెల్ల గీతలు, బ్రౌన్ కలర్ ప్యాంటు కలదని, శవాన్ని అన్నం సేవా ఫౌండేషన్ వారి సహాయం తో ఖమ్మం ప్రధాన గవర్నమెంట్ హాస్పిటల్ మార్చురీకి తరలించనట్లు తెలిపారు. డోర్నకల్ ఎస్ఐ కె. శ్రీకాంత్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎవరికైనా వివరాలు తెలిస్తే ఈ క్రింది నెంబర్లకు 8712658600,9494790619 సంప్రదించాలని కోరారు.



Next Story

Most Viewed