ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య

by Disha Web Desk 15 |
ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య
X

దిశ, కారేపల్లి : కారేపల్లిలో అనారోగ్యం తాళ్లలేక వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం సీపీఎంలో, ప్రజాశక్తి విలేకరి గా అనేక సంవత్సరాలు పనిచేసిన నర్సింగ్‌ ఉమామహేశ్వరరావు(54) శనివారం తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇటీవల కాన్యర్‌తో బాధపడుతూ హైదరాబాద్‌లో చికిత్స తీసుకుంటున్నాడు. అతనికి సీపీఎం, అతని అభిమానులు, మిత్రులు సైతం వైద్య ఖర్చులను సాయం చేస్తూ చికిత్స జరిపిస్తున్నారు. ఈ క్రమంలో చికిత్స కోసం హైదరాబాద్‌ వెళ్లిన ఉమామహేశ్వరరావు శనివారం తెల్లవారుజామున కారేపల్లిలోని ఇంటికి తిరిగి వచ్చాడు. సాయంత్రం సమయంలో పక్క ఇంటి వారు టీ తీసుకొని వచ్చి ఉమామహేశ్వరరావును పిలిచినా పలకక పోవటంతో తలుపు నెట్టి చూడగా ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఉన్నాడు. మృతునికి భార్య నాగేంద్ర, ఇద్దరు కుమారులు ఉన్నారు. సంఘటన స్ధలంను కారేపల్లి ఎస్సై పుష్పాల రామారావు పరిశీలించి మృతదేహాన్ని కిందికి దింపారు. మృతదేహాన్ని అన్ని రాజకీయ పక్షాల నాయకులు సందర్శించి నివాళ్లు అర్పించారు.


Next Story

Most Viewed