ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన జాతీయ బృందం

by Sridhar Babu |
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన జాతీయ బృందం
X

దిశ, టేకులపల్లి : టేకులపల్లి మండలంలోని సులానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జాతీయ నాణ్యతా భరోసా ప్రమాణాల బృందం సభ్యులు డాక్టర్ సునీల్ శర్మ, డాక్టర్ సంగీత సందర్శించారు. సులానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ద్వారా ప్రజలకు అందుతున్న సేవలు, పాటిస్తున్న నియమనిబంధనలు జాతీయ నాణ్యత భరోసా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నవా లేవా అని రెండు రోజులుగా ప్రతీ విభాగాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నిన్న ఉదయం 9 గంటల నుండి మొదలైన తనిఖీ కార్యక్రమం ఈరోజు సాయంత్రం మూడు గంటలకు ముగిసింది. బృందం సభ్యులు అన్ని రకాల రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు.

ప్రసవం సమయంలో తీసుకుంటున్న ప్రమాణాలను తనిఖీ చేశారు. అలాగే క్షయ వ్యాధి, కుష్టు వ్యాధి బయో వేస్టేజీ విధానం, లేబరేటరీ, ఫార్మసీ, ప్రసూతి విభాగాలను తనిఖీ చేశారు. అలాగే ఇతర జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు అమలు అవుతున్న తీరుతెన్నులను సిబ్బంది అందరిని ముఖాముఖి ద్వారా ప్రశ్నించి అడిగి తెలుసుకున్నారు. జాతీయ ప్రమాణాలకు సమానమైన అన్ని విభాగాల్లో పాటించడానికి కావాల్సిన సూచనలు, సలహాలు సిబ్బందికి ఇచ్చారు.

కేంద్ర ప్రభుత్వ సభ్యుల బృందంలో డాక్టర్ సునీల్ శర్మ, డాక్టర్ సంగీత, డాక్టర్ బాలాజీ నాయక్, డాక్టర్ మణికంఠ రెడ్డి, డాక్టర్ చైతన్య సుందర్, సాగర్, ఎబినైజర్ వేదమణి, సునీత, సాజిదా బేగం, పబ్లిక్ హెల్త్ నర్సు సత్యవతి, గన్యా నాయక్, హరికృష్ణ, శంకర్, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ ధరణి, హారిక, శైలజ, స్థానిక వైద్యాధికారి డాక్టర్ కందుల దినేష్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సీతమ్మ, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.



Next Story

Most Viewed