రెండు మోటార్‌ సైకిళ్లు ఢీకొని వ్యక్తి మృతి

by Sridhar Babu |
రెండు మోటార్‌ సైకిళ్లు ఢీకొని వ్యక్తి మృతి
X

దిశ, కారేపల్లి : రెండు మోటార్‌ సైకిళ్లు ఢీ కొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన కారేపల్లి మండలం సీతారాంపురం వద్ద బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సీతారాంపురంనకు చెందిన మూడు కిషన్‌(45) ఇంట్లో నుండి ఇల్లందుకు ఖమ్మం మీదగా వస్తున్నాడు. అదే క్రమంలో సీతారాంపురంనకు చెందిన పూనెం నవీన్‌ బస్వాపురం నుంచి సీతారాంపురంనకు వస్తున్న క్రమంలో మెయిన్‌ రోడ్‌ మీద మోటార్‌ సైకిళ్లు ఢీ కొన్నాయి.

ఈప్రమాదంలో మూడు కిషన్‌ రోడ్డుపై పడటంతో తలకు తీవ్రగాయమైంది. అతడిని 108 ద్వారా ఇల్లందు ఆసుపత్రికి తరలించారు. పరిస్ధితి విషమంగా ఉండటంతో ఖమ్మం అసుపత్రికి తరలించి చికిత్స నిర్వహిస్తుండగా మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. మృతుని సోదరుడు మూడు ఉదయ్‌ ఫిర్యాదు మేరకు కారేపల్లి ఎస్సై పుష్పాల రామారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



Next Story

Most Viewed