సత్తుపల్లిలో బీఆర్ఎస్ శ్రేణుల భారీ ర్యాలీ

by Aamani |
సత్తుపల్లిలో బీఆర్ఎస్ శ్రేణుల భారీ ర్యాలీ
X

దిశ సత్తుపల్లి : బీఆర్ఎస్ పార్టీ 22వ ఆవిర్భావాన్ని పురస్కరించుకొని సత్తుపల్లి పట్టణంలో స్థానిక మున్సిపల్ చైర్మన్ కూసం పూడి మహేష్, స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే వెంకట వీరయ్య ఆధ్వర్యంలో ఎమ్మార్వో ఆఫీస్ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడ నుంచి ర్యాలీగా బయలుదేరి, ఆర్ అండ్ బి అతిధి గృహం వద్ద, పట్టణంలో పలు వార్డుల్లో ఏర్పాటుచేసిన బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరించి, అనంతరం స్థానిక మున్సిపాలిటీ ఆవరణంలో తెలంగాణ సంక్షేమ పథకాలు సత్తుపల్లిలో జరిగిన పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ఏర్పాటుచేసిన 200 అడుగుల ఫ్లెక్సీ హోర్డింగ్ ను ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య చేతుల మీదుగా ప్రారంభించారు, స్థానిక రింగ్ సెంటర్ నందుగల అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించి అమరవీరులకు జోహార్లు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు, ర్యాలీ నీ పట్టణ శివారులో ఉన్న స్థానిక సాయి బాలాజీ ఫంక్షన్ హాల్ వరుకు కొనసాగించారు, ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, ఆత్మ కమిటీ చైర్మన్ వనమా వాసు, టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు మోనార్క రఫీ, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి మల్లూరు అంకం రాజు, మున్సిపల్ వైస్ వైస్ చైర్ పర్సన్ తోట సుశీల రాణి, ఎంపీపీ దొడ్డ హైమావతి శంకరరావు, జడ్పిటిసి సభ్యులు కూసంపూడి రామారావు, పలువురు వార్డు కౌన్సిలర్లు, అద్దంకి అనిల్, చాంద్ బాషా, తడికమల్ల ప్రకాశరావు, మందపాటి పద్మజ్యోతి, కంటే నాగలక్ష్మి, నరుకుళ్ళ శ్రీనివాసరావు, మట్టా ప్రసాద్, మౌలాలి వార్డు కౌన్సిలర్లు బీఆర్ఎస్ నాయకులు, పెద్ద సంఖ్యలో తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed