భద్రాచలంలో ఘనంగా ఆధ్యాత్మిక దినోత్సవం

by Sridhar Babu |

దిశ, భద్రాచలం : తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు బుధవారం భద్రాచలం శ్రీసీతారామ చంద్ర స్వామి వారి దేవస్థానం జిల్లా స్థాయి ఆధ్యాత్మిక వేడుకలకు వేదిక అయింది. ఉదయం నుండి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రచార రథంతో మేళ తాళాలు, మంగళ వాయుద్యాలు, విచిత్ర వేషధారణలతో గ్రామ ప్రదక్షిణ నిర్వహించారు.

సాయంత్రం వైకుంఠ ద్వారం వద్ద పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్, పినపాక శాసన సభ్యులు రేగా కాంతారావు పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తుందని అన్నారు. ప్రతి నెలా దూప దీప నైవేద్యాల కోసం 6440 ఆలయాలకు ఆర్థిక సహకారం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్, రామాలయ ఈ ఓ రమాదేవి, భద్రాచలం అర్డీ ఓ రత్న, కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed