వాట్సప్‌లో చక్కెర్లు కొట్టిన పురుగు అక్కడ ప్రత్యక్షం.. భయంతో ఆసుపత్రికి రైతు!

by Satheesh |
వాట్సప్‌లో చక్కెర్లు కొట్టిన పురుగు అక్కడ ప్రత్యక్షం.. భయంతో ఆసుపత్రికి రైతు!
X

దిశ, ఖమ్మం రూరల్: రూరల్ ​మండలం గోళ్ళపాడు గ్రామానికి చెందిన కొండం ప్రభాకర్​ అనే రైతు పశువుల కోసం గడ్డి తీసుకు వచ్చేందుకు పొలం వద్దకు వెళ్లాడు. గడ్డి కోస్తున్న క్రమంలో ఓ వింత పురుగు అతడికి కుట్టింది. వెంటనే గమనించిన ప్రభాకర్​విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడంతో చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ హస్పిటల్‌కు తరలించారు. చికిత్స చేసిన వైద్యులు ఎలాంటి ప్రాణపాయం లేదని చెప్పారు. అయితే, ఇటీవల వాట్సప్‌లో ఓ వింత పురుగు కరవడం వలన మనుషులు వెంటనే చనిపోతున్నారనే వార్త జోరుగా చక్కెర్లు కొట్టింది. ప్రభాకర్‌ను కరిచిన పురుగు కూడ దాని వలే ఉండటంతో అతడు​భయపడి హస్పిటల్‌కు వెళ్లాడు. అయితే ప్రభాకర్‌కు ఎటువంటి ప్రమాదం లేదని, భయపడాల్సిన అవసరంలేదని వైద్యలు తెలిపారు. ఈ విషయం బయటికి తెలియడంతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.



Next Story

Most Viewed