- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
జాబ్ వస్తుందనుకుంటే డబ్బులు పోయే..

దిశ, కూసుమంచి: కూసుమంచి మండలం నాయకునిగూడెం గ్రామానికి చెందిన వంగవీటి ఉపేందర్ ఆన్లైన్ జాబ్ పేరిట సైబర్ నేరగాళ్లకు రూ.87,350 చెల్లించి మోసపోయాడు. గత నెల 12వ తేదీన ఆన్లైన్లో ఉండగా వాట్సప్లో గుర్తుతెలియని నెంబర్ నుంచి ఆన్లైన్ జాబ్స్ పేరిట లింకు వచ్చింది. దానిని క్లిక్ చేయగా కొన్ని టాస్కులు పూర్తి చేస్తే మీ డబ్బు రెట్టింపు అవుతుందని సైబర్ మోసగాళ్లు నమ్మబలికారు. దీంతో ఆ యువకుడు టాస్క్లు పూర్తి చేసే క్రమంలో రూ.87,350 యూపీఐ ఐడీల ద్వారా చెల్లించాడు. డబ్బు రెట్టింపు కాకపోగా అకౌంట్లో ఉన్న 87 వేల 350 రూపాయలు గల్లంతవటంతో తాను మోసపోయానని గుర్తించాడు. దీంతో కూసుమంచి పోలీసులు ఆశ్రయించగా ఎస్ఐ నందీప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులు పెట్టే మోసపురిత లింకులు ఏవైనా వాటిని క్లిక్ చేయవద్దని విజ్ఞప్తి చేశారు.