రియల్ వ్యాపారి దారుణ హత్య

by Shiva |
రియల్ వ్యాపారి దారుణ హత్య
X

దిశ, కంటోన్మెంట్ / బోయిన్ పల్లి: ఓ రియల్ వ్యాపారి దారుణ హత్యకు గురైన ఘటన బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..ని దిల్ ఖుష్ నగర్ లో నివాసం ఉండే ఫయాజుద్దీన్(40) కేఎమ్ఆర్ ఇండియా ప్రై్వేట్ లిమిటెడ్ సంస్థలో సుమారు రూ.50లక్షలు పెట్టుబడి పెట్టాడని సమాచారం. అయితే.. సంస్థలో లాభాలు వచ్చినా తనకు వాటా ఇవ్వకపోవడం గురించి బార్కాస్ లో ఉండే మోసా సిద్దిఖీ(42)ను కలిసి మాట్లాడేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో డబ్బు విషయమై ఇద్దరి మధ్య మాట మాట పెరిగింది. ఈ నేపథ్యంలో ఆవేశానికి లోలైన ఫయాజుద్దీన్ అతని వెంట తీసుకొచ్చిన కత్తితో సిద్దిఖీని పొడచాడు. దీంతో అతను రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ ప్రాణాలు విడిచాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.



Next Story

Most Viewed