రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి

by Disha Web Desk 15 |
రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి
X

దిశ, ములకలపల్లి : ఆయిల్ ట్యాంకర్ ట్రాక్టర్ ని ఢీ కొనడంతో బాలుడు మృతి చెందిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సంజీవ్ పల్లి గ్రామానికి చెందిన కొరస ప్రవీణ్ కుమార్, సడియం సంతోష్ ఇద్దరూ ట్రాక్టర్ పై పాల్వంచ వెళ్లి వస్తున్న క్రమంలో సీతారాం పురం పంచాయతీ పాతూరు వద్ద వెనకాల వచ్చిన ట్యాంకర్ బలంగా ఢీ కొనడంతో ట్రాక్టర్ పల్టీ కొట్టింది.

డ్రైవర్ తోపాటు సంతోష్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు 108 సహాయంతో పాల్వంచ ఆసుపత్రికి తీసుకొని వెళ్లారు. చికిత్స పొందుతూ సంతోష్ (15)మృతి చెందాడు. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. బాలుడు తండ్రి సత్యం ఫిర్యాదు మేరకు ఎస్సై సాయి కిషోర్ రెడ్డి కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



Next Story