- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
4.5 కిలోల గంజాయి స్వాధీనం
by Shiva |

X
దిశ, గుండాల: ఆళ్లపల్లి మండల పరిధిలోని పాతూరులో సుమారు రూ.90 వేల విలువ గల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ ఇంద్రసేనారెడ్డి రితీష్ తెలిపారు. వివరాల్లోకి వెళితే.. పాతూరులో తనిఖీలు నిర్వహిస్తుండగా గుగ్గల జనార్ధన అనే వ్యక్తి ఒక మూటతో అనుమానస్పదంగా కనిపించాడని తెలిపారు. తీరా తనిఖీ చేయగా.. అతడి నుంచి దాదాపు 4.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని దాని విలువ మార్కెట్లో రూ.90వేలు ఉంటుందని పేర్కొన్నారు. గుగ్గల హనుమంతు అనే వ్యక్తి గూగ్గల జనార్ధన్ ద్వారా గంజాయిని పట్టణ ప్రాంతాల్లో విక్రయించడానికి పంపినట్లు విచారణలో వెల్లడైందని తెలిపారు. వారి ఇరువురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, ఏజెన్సీ ప్రాంతంలో మొదటిసారి గంజాయి లభ్యం కావడంతో తనిఖీలను మరింత ముమ్మరం చేశామని సీఐ తెలిపారు.
Next Story