- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఏఎస్సైనంటూ రూ.40 వేలు టోకరా

దిశ, అశ్వారావుపేట : ఆన్లైన్ మనీ ట్రాన్సాక్షన్ ను అదనుగా చేసుకుని మోసానికి పాల్పడడంలో కేటుగాళ్లు కొత్తదారులు వెతుకుతున్నారు. పోలీస్ అధికారి నంటూ మైండ్ గేమ్ ఆడి ఆన్ లైన్ సెంటర్ నిర్వాహకుల వద్ద నగదుని కాజేశాడు ఓ అగంతకుడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలో చోటుచేసుకుంది. గత నెల 29న అశ్వారావుపేటలోని ఓ మీసేవ సెంటర్ నిర్వాహకుడికి స్థానిక పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహించే ఏఎస్సై అశోక్ నంటూ ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. అర్జెంటుగా రూ.40 వేలు ఓ యూపీఐ ఖాతాకు బదిలీ చేయాలని చెప్పాడు. ఆ నగదుని కొద్దిసేపట్లో తన అసిస్టెంట్ కి ఇచ్చి పంపుతానన్నాడు. సదరు మీ సేవ నిర్వాహకుడు బిజీగా ఉండడంతో ఏపీజీబీ బ్యాంకు సమీపంలో ఆన్లైన్ సెంటర్ నిర్వాహకులకు ఈ పనిని అప్పజెప్పాడు.
యూపీఐ ఖాతా క్యూఆర్ కోడ్ ను వాట్సాప్ లో పంపి నగదును తొందరగా బదిలీ చేయాలని కేటుగాడు కంగారు పెట్టడంతో శ్రీ లక్ష్మీ టాకీస్ సమీపంలోని మరో ఆన్లైన్ సెంటర్ నిర్వాహకుడు ద్వారా రూ.40 వేల నగదును బదిలీ చేయించారు. ఆ తర్వాత ఏఎస్సై అంటూ మాట్లాడిన వ్యక్తి ఫోన్ స్విచ్డ్ ఆఫ్ అవ్వడం.. నగదు తీసుకొని ఎవరూ రాకపోవడంతో అనుమానం వచ్చి ఏఎస్సై అశోక్ గురించి ఆరా తీయగా అలాంటి వ్యక్తి ఎవరూ స్థానికంగా పనిచేయడం లేదని తెలుసుకొని ఖంగుతిన్నారు. ఆ కేటుగాడు పంపిన క్యూఆర్ కోడ్ కూడా మహారాష్ట్రలోని ఓ మద్యం దుకాణానికి చెందినదిగా తెలుసుకున్నారు. తమతో ఫోన్లో మాట్లాడి నగదు బదిలీ చేయించిన వ్యక్తి నకిలీ పోలీస్ అని.. తాము మోసపోయమని తెలుసుకొని లబోదిబోమన్నారు. ఆన్లైన్ మనీ ట్రాన్స్ఫర్ చేసే వాళ్లు అన్ని నిర్ధారించుకుని నగదు తీసుకున్నకే లావాదేవి చేస్తుంటారు.
కానీ పోలీస్ అనగానే గౌరవంతో పాటు ఎందుకో తెలియని భయం వల్ల ఎదురు ప్రశ్నించకుండా నగదు ట్రాన్స్ఫర్ చేశారు. జరిగిన మోసంపై సదరు ఆన్లైన్ సెంటర్ నిర్వాహకురాలు సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. అయితే ఆన్లైన్ మనీ ట్రాన్సాక్షన్ నిర్వాహకుల అకౌంట్ లలో వేలకొద్దీ డబ్బులు ఉన్నా అది కేవలం పెట్టుబడికి మాత్రమే ఉపయోగపడతాయి. వాటిపై వచ్చే పది రూపాయల కమిషన్ కోసమే వారి ప్రయాసంత. అలాంటి వారి దగ్గర వేలకొద్ది నగదును మాయగాళ్లు కాజేయడంతో వారి పరిస్థితి దిక్కుతోచని విధంగా మారుతుంది.