200 గ్రాముల గంజాయి పట్టివేత

by Sridhar Babu |
200 గ్రాముల గంజాయి పట్టివేత
X

దిశ,తిరుమలాయపాలెం : తిరుమలాయపాలెం పోలీసులు శనివారం చేపట్టిన వెహికిల్ చెకింగ్లో సుమారు 200 గ్రాముల గంజాయి పట్టుబడింది. అందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎస్సై వారాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో శనివారం ఉదయం బీరోలు గ్రామంలో వెహికిల్ తనిఖీలు చేపట్టారు. బాణోత్ వంశీ (22)అనే యువకుడు గ్లామర్ బైక్ పై సూర్యాపేట నుంచి దమ్మాయిగూడెం వైపు వెళ్తున్నాడు.

పోలీసులు అనుమానంతో అతడి బైక్ తనిఖీ చేయగా సుమారు 200 గ్రాముల అక్రమ గంజాయి తరలిస్తున్నట్టు గుర్తించారు. పట్టుబడిన యువకుడు తిరుమలాయపాలెం మండలంలోని సోలిపురం శివారు, పిఖ్యాతండాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. దీంతో ఆ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్టేషన్ కు తరలించారు. తనిఖీల్లో ఏఎస్ఐ రాఘవయ్య, సిబ్బంది వీరస్వామి, ఎల్.వెంకటేశ్వర్లు, ఉపేందర్ పాల్గొన్నారు.



Next Story

Most Viewed