- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఖమ్మం బీఆర్ఎస్కు భారీ షాక్.. పార్టీకి 200 కుటుంబాలు గుడ్ బై

దిశ, కామేపల్లి : ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. కామేపల్లి మండలం, పండితాపురం గ్రామంలో ఆదివారం బిఆర్ఎస్ పార్టీకి 200 కుటుంబాలు రాజీనామా చేశారు. అలాగే తామంతా డీసీసీబీ డైరెక్టర్ మేకల మల్లి బాబు యాదవ్ ఆధ్వర్యంలో ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బాటలో నడుస్తామని రాజీనామా చేసిన నేతలు స్పష్టం చేశారు. రాజీనామా చేసిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నేతలు తొండల ముత్తయ్య, మేకపోతుల మహేష్ (పిఎసిఎస్ డైరెక్టర్), మొగిలి విజయ,భానోత్ లచ్చిరాం,భానోత్ నరసింహ నాయక్,గుంటుపల్లి వెంకట్రావు, ధరావత్ హరి చందర్, బండి లక్ష్మి నర్సు, చల్లా వెంకన్న, బొమ్మగాని పిచ్చయ్య, దొడ్ల లక్ష్మణ్, పల్లె ఉపేందర్ రావు, జలగం శ్రీనుతో పాటు మరో 450 కుటుంబాలు త్వరలో మేకల మల్లి బాబు యాదవ్ సారధ్యంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బాటలో నడిచేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.