10 కేజీల గంజాయి స్వాధీనం

by Sridhar Babu |
10 కేజీల గంజాయి స్వాధీనం
X

దిశా, జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో పోలీసులు 10 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులకు ఓ ద్విచక్ర వాహనంపై వస్తున్న ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించగా వారిని ఆపేందుకు ప్రయ త్నించగా పరారీ అయ్యారు. దాంతో వారిని వెంబడించి పట్టుకొని తనిఖీ చేయగా వారి వద్ద నుంచి పది కేజీల గంజాయితో పాటు రెండు సెల్ ఫోన్లు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని స్టేషన్​కు తరలించారు. నిందితులు షేక్ సల్మాన్, మహారాష్ట్ర గా, షేక్ యునెస్​ ది కాంచన బాగ్ హైదరాబాద్ గా గుర్తించి వారిపై కేసు నమోదు చేశారు. పట్టుపడ్డ గంజాయి విలువ సుమారు రూ.1,50, 000 ఉంటుందని ఎస్సై గణేష్ తెలిపారు.



Next Story

Most Viewed