కాసాని కుటుంబాన్ని పరామర్శించిన చంద్రబాబు

by Shiva |   ( Updated:2023-02-05 12:50:54.0  )
కాసాని కుటుంబాన్ని పరామర్శించిన చంద్రబాబు
X

దిశ, కుత్బుల్లాపూర్: తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ కుటుంబాన్ని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు. అనారోగ్యంతో కొద్ది రోజుల క్రితం కాసాని జ్ఞానేశ్వర్ తల్లి కాసాని కౌసల్య మృతిచెందారు. బాచుపల్లిలోని కాసాని జ్ఞానేశ్వర్ నివాసంలో కాసాని కౌసల్య చిత్రపటానికి చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకులు కాసాని వీరేష్, మాజీ పూర్వ రంగారెడ్డి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కాసాని శ్వేతా సుధాకర్, కార్పొరేటర్లు కాసాని శిరీష వీరేష్ ముదిరాజ్, కాసాని సుధాకర్, నిజాంపేట్ సీనియర్ టీడీపీ నాయకులు కొలన్ నర్సింహారెడ్డి, పలువురు నాయకులు పాల్గొన్నారు



Next Story

Most Viewed