- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
మున్సిపాలిటీని తలదన్నేలా పంచాయతీ రోడ్లు : ఎమ్మెల్యే మెచ్చా

దిశ, అశ్వారావుపేట : బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో తెలంగాణలో పట్టణాలకు దీటుగా పల్లెలు రూపు రేఖలు మారుతున్నాయని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం అశ్వారావుపేట మండలంలో అచ్యుతాపురం-ఎస్సీ కాలనీ, దిబ్బగూడెం, మద్దికొండ, పెన్నాడవారిపాలెం, జమ్మిగూడెం, కేసప్పగూడెం, రాజీవ్ నగర్, కామయినగర్(దబ్బతోగు), వినాయకపురం కాలనీ - వినాయకపురం, ఆసుపాక కాలనీ, ఉసిర్లగూడెం, తిరుమలకుంట, పాతరెడ్డిగూడెం(సుద్దగోతులగూడెం) గ్రామాల్లో రూ. కోటి 65 లక్షల వ్యయంతో నిర్మాణం చేపట్టిన 18 సీసీ రోడ్లను ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు.
అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో మండుటెండలోను సుడిగాలి పర్యటన చేపట్టిన ఎమ్మెల్యే మెచ్చా.. ఆసుపాకలో 30 కుటుంబాలను బీఆర్ఎస్ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాజీవ్ నగర్ లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు విద్యుత్ మీటర్లు లేవని లబ్ధిదారులు తెలపడంతో విద్యుత్ శాఖ ఏడీతో ఫోన్లో మాట్లాడి సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. సుద్ధ గోతులగూడెం పైగుంపునకు మంచినీటి సరఫరా సౌకర్యాన్ని మెరుగుపరచాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.