‘ఉగ్రవాదులను ఏరివేయాలన్నా.. శత్రు దేశాలకు బుద్ధి చెప్పాలన్నా మోడీతోనే సాధ్యం’

by Disha Web Desk 2 |
‘ఉగ్రవాదులను ఏరివేయాలన్నా.. శత్రు దేశాలకు బుద్ధి చెప్పాలన్నా మోడీతోనే సాధ్యం’
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీపై కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఉగాది పండుగ సందర్భంగా హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచార రథాలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఉగ్రవాదులను ఏరి వేయాలన్నా.. శత్రు దేశాలకు బుద్ధి చెప్పాలన్నా ప్రధాని నరేంద్ర మోడీతోనే సాధ్యమని అన్నారు. మోడీ హయాంలో అన్ని మతాలకు మేలు జరిగిందని తెలిపారు. తెలంగాణను పదేళ్ల పాటు కేసీఆర్ కుటుంబం తమ స్వార్థం కోసం వాడుకుందని విమర్శించారు.


కేసీఆర్ పదేళ్ళ పాటు తన కొడుకు, కూతురు, అల్లుడు, ఫామ్ హౌస్ గురించి మాత్రమే ఆలోచించాడని... కానీ తెలంగాణ అభివృద్ధి గురించి ఆలోచించలేదన్నారు. కానీ ఈ రోజు పరిస్థితి చూస్తుంటే దొంగలు పోయి.. గజదొంగలు వచ్చినట్లుందని కాంగ్రెస్ సర్కా్ర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చి వేటినీ నెరవేర్చడం లేదన్నారు. డిసెంబర్ 9వ తేదీ నాడు రుణమాఫీ చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని, కానీ దానిని మరిచిపోయారన్నారు. రాహుల్ గాంధీకి అయితే ఇవేమీ తెలియదని ఎద్దేవా చేశారు.



Next Story

Most Viewed