- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
మునుగోడు ఫలితంపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు

దిశ, తెలంగాణ బ్యూరో: మునుగోడు ఉపఎన్నికలో నైతికంగా బీఎస్పీ పార్టీ గెలిచిందని, బహుజన వాదంతో ఆధిపత్య పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేశామని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఎంత అధికార దుర్వినియోగానికి పాల్పడి రిగ్గింగ్ చేసినా మునుగోడు ఓటర్లు బీఎస్పీ పార్టీని ఆదరించి 4145 ఓట్లు వేసినందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు. అన్ని పార్టీలు కలిసి ఓటుకు 45 వేల చొప్పున పంపిణీ చేసినా నాలుగు వేల మంది ఓటర్లు స్వచ్ఛమైన, పారదర్శకమైన రాజకీయాలకు మద్దతు పలికారని తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికల కౌంటింగ్ అనంతరం ఆదివారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. గత 70 ఏళ్లుగా ఆధిపత్యం చలాయిస్తున్న అగ్రవర్ణ పార్టీలకు అడ్డాగా మారిన మునుగోడు గడ్డపై నాలుగువేల మంది నీలి జెండా వైపు నిలబడ్డారని పేర్కొన్నారు. ప్రజలందరిని ప్రలోభపెట్టి అధికారాన్ని ఉపయోగించి ప్రజలను మోసం చేశారన్నారు. రాబోయే కాలంలో మునుగోడు సమస్యలపై పోరాడుతామని నిరంతరం ప్రజల మధ్య ఉంటామన్నారు. ఒక్క రూపాయి, ఒక్క మద్యం చుక్క ఓటర్లకు పంచకుండా ఆత్మగౌరవంతో, రాజ్యాంగబద్దంగా, ఎన్నికల కమిషన్ నిబంధనలను గౌరవించి నిజాయితీగా రాజకీయాలు చేసిన ఏకైక పార్టీ బీఎస్పీ అని తెలిపారు. ఇకమీదట నిరంతరం ప్రజల్లో ఉంటామని, ప్రజల అవసరాలు, సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామని పేర్కొన్నారు.