'టీఆర్ఎస్ నాయకులు మాపై దాడికి యత్నించారు'

by Dishanational2 |
టీఆర్ఎస్ నాయకులు మాపై దాడికి యత్నించారు
X

దిశ, శంకరపట్నం: మా గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టలేదని ఎమ్మెల్యే రసమయికి వినతి పత్రం అందజేస్తామంటే కేశవపట్నం పోలీసులు, టీఆర్ఎస్ నాయకులు మాపై దాడికి యత్నించారని, కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు గోపగోని బసవయ్య గౌడ్, బీజేపీ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి అలివేలి సమ్మిరెడ్డి ఆరోపించారు. మంగళవారం కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గంలోని, శంకరపట్నం మండలంలోని గద్దపాక గ్రామంలో నూతనంగా మంజూరైన రేషన్ షాపుల ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా బసవయ్య గౌడ్, సమ్మిరెడ్డి మాట్లాడారు, కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఆధ్వర్యంలో గ్రామంలో నెలకొన్న సమస్యలపై ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కు సమస్యలు విన్నవిస్తామని, గ్రామంలో ఎమ్మెల్యే ర్యాలీలో ఎదురు రాగా, కేశవపట్నం ఎస్ఐ దేశ్ చంద్రశేఖర్ పోలీసు సిబ్బందిచే గెంటి వేయించారని, టీఆర్ఎస్ నాయకులు దాడికి యత్నించారని, ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య దేశంలో గ్రామ సమస్యలు విన్నవించడానికి గ్రామస్తులము ,నాయకులం ఉండగా కావాలని పోలీసులు టీఆర్ఎస్ నాయకులు తమను గెంటివేశారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ రాజు, వార్డు సభ్యులు ప్రవీణ్, తోపాటు కాంగ్రెస్, బీజేపీ నాయకులు, సుమారు 100 మంది గ్రామస్తులు ఉన్నారు.


Next Story

Most Viewed