- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- కార్టూన్
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- Bigg Boss Telugu 7
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
- ICC World Cup 2023
గుండు పిన్ను మొనపై వినాయకుడి రూపం.. మైక్రో ఆర్టిస్ట్ ప్రతిభ
by Disha Web Desk 1 |

X
దిశ, జగిత్యాల ప్రతినిధి : వినాయక చతుర్ధిని పురస్కరించుకుని జగిత్యాలకు చెందిన సూక్ష్మ కళాకారుడు తన ప్రతిభ మరోసారి చాటాడు. గణపతి నవరాత్రుల సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన డాక్టర్ గుర్రం దయాకర్ గుండు పిన్నుపై వినాయకుడి రూపాన్ని పొందుపరిచారు. చంద్రయాన్-3 విజయవంతం, జీ 20 దేశాల సదస్సుకు భారతదేశం వేదికైన నేపథ్యంలో భారతదేశ జెండా పట్టుకుని ఉన్న వినాయకుని రూపాన్ని జీ20 లోగోతో తయారు చేయడం ప్రత్యేకత సంతరించుకుంది. 6 మి.మీ. పొడవు, 4 మీ.మీ. వెడల్పుతో ఈ కళాకృతిని రూపొందించడం విశేషం. అత్యంత సూక్ష్మంగా గుండు పిన్ను మొనపై కొలువుదీరిన లంబోదరుడి తయారీకి ఎనిమిది గంటల సమయం పట్టినట్లు దయాకర్ తెలిపారు. సూక్ష్మ రూప వినాయకుడిని రూపొందించిన దయాకర్ ను పలువురు అభినందించారు.
Next Story