ఆపరేషన్ సిందూర్.. రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు

by Sumithra |
ఆపరేషన్ సిందూర్.. రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు
X

దిశ, వేములవాడ : పాకిస్తాన్ దేశంలోని ఉగ్రవాద స్థావరాల ఏరివేతే లక్ష్యంగా భారత్ ఆపరేషన్ సిందూర్ ని కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఈ ఆపరేషన్ విజయవంతం కావాలని, యుద్ధంలో పాల్గొంటున్న భారత త్రివిధ దళాలు క్షేమంగా ఉండాలని, సైన్యానికి దైవిక బల రక్షణ ఆశీస్సులు ఉండాలని తెలంగాణ ప్రభుత్వ దేవాదాయ ధర్మాదాయ శాఖ సూచనల మేరకు శుక్రవారం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో అర్చకులు, వేద పండితులు శ్రీ లక్ష్మీ గణపతి, శ్రీ పార్వతీ సమేత రాజరాజేశ్వర స్వామి వార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శౌర్యానికి, ధైర్యానికి ప్రతీకలైన భారత సైనికుల భద్రత, ఆరోగ్యం శ్రేయస్సుతో పాటు దేశవ్యాప్తంగా శాంతి, సామరస్యం కొనసాగాలని చండీ సహిత రుద్ర హోమం నిర్వహించారు. భారతావని పై ఆ పరమేశ్వరుడి కృపా కటాక్షం ఉండాలని, భారత సాయుధ దళాలకు సంపూర్ణ దిగ్విజయం చేకూరాలని అర్చకులు కోరుకున్నారు.



Next Story

Most Viewed