విధుల్లో మృతి చెందిన ఎస్ఐ కుటుంబానికి చెక్ అందజేసిన జిల్లా ఎస్పీ

by Dishafeatures2 |
విధుల్లో మృతి చెందిన ఎస్ఐ కుటుంబానికి చెక్ అందజేసిన జిల్లా ఎస్పీ
X

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: వేములవాడ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తూ గత సంవత్సరం అనారోగ్యంతో మరణించిన ఉపేందర్ కుటుంబానికి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అండగా నిలిచారు. ఈ మేరకు ఎస్పీ కార్యాలయంలో సోమవారం బాధిత కుటుంబానికి కార్పస్ ఫండ్ నుంచి రేూ.60 వేల చెక్కును అందజేశారు. ఉపేందర్ కుటుంబానికి ప్రభుత్వం నుంచి అందాల్సిన అన్ని రకాల సాయాన్ని వీలైనంత త్వరగా అందేలా తగు చర్యలు తీసుకోవాలని జిల్లా పోలీస్ కార్యాలయ అధికారులకు సూచించారు. పోలీసుల కుటుంబాలకు పోలీస్ శాఖ అన్ని రకాలుగా అండగా నిలుస్తుందని, ప్రభుత్వం ద్వారా వారికి రావాల్సిన అన్ని రకాల లబ్ది సాధ్యమైనంత త్వరగా ఇప్పించేలా కృషి చేస్తామని ఎస్పీ తెలిపారు.


Next Story

Most Viewed