వేములవాడ జాతర ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ అఖిల్ మహాజన్

by Dishafeatures2 |
వేములవాడ జాతర ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ అఖిల్ మహాజన్
X

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: ఈ నెల 17,18 ,19 రోజుల్లో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి (మహా శివరాత్రి) జాతర సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ జాతర ఏర్పాట్లను పరిశీలించారు. జాతరకు వచ్చే భక్త జనానికి ఎలాంటి ఆటంకాలు జరగకుండా ఏర్పాట్లు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. సీసీ కెమెరాల ద్యారా భద్రతా చర్యలను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలన్నారు. ధర్మ దర్శనం, శీఘ్ర దర్శనం, ఆలయంలోని మిగతా క్యూలైన్ల వద్ద తొక్కిసలాట జరకుండా చూడాలని సూచించారు. అలాగే పార్కింగ్ విషయంలో పకడ్బందీగా ఉండాలని ఎస్పీ ఆదేశించారు. అదేవిధంగా ఆలయంలో భక్తులు కన్ఫూజ్ కాకుండా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఎస్పీ వెంట ఈవో కృష్ణప్రసాద్, డీఎస్పీ నాగేంద్రచారి, సీఐ వెంకటేష్, ఈ ఈ రాజేష్ తదితరులు ఉన్నారు.


Next Story

Most Viewed