డేంజర్‌గా రామడుగు బ్రిడ్జి.. ఏ క్షణం ఏం జరుగుతుందో అని టెన్షన్..!

by Disha Web Desk 19 |
డేంజర్‌గా రామడుగు బ్రిడ్జి.. ఏ క్షణం ఏం జరుగుతుందో అని టెన్షన్..!
X

దిశ, రామడుగు: రామడుగు మండల కేంద్రంలో కరీంనగర్ వెళ్లే రహదారిలో ఉన్న వంతెన పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. ఏ క్షణంలో కూలిపోతుందో అనే పరిస్థితికి చేరుకుంది. వాహనాలు వెళితే వైబ్రేషన్ రావడంతో అధికారులు రాకపోకలను నిలిపివేశారు. రాకపోకలు నిలిపివేయడంతో నిత్యం కరీంనగర్ వెళ్లే వాహనదారులకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. వాహనదారులు రామడుగు ఆంధ్ర బ్యాంకు నుండి వయా కుక్కర్ కుంట మీదుగా వెళ్లాలని సూచించారు. కొత్త బ్రిడ్జి పనులు కాస్త ఆగిపోవడంతో వాహనదారులు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు. సాక్షాత్తు ఆర్డీవో వచ్చి భూ సేకరణకై గ్రామసభ ఏర్పాటు చేసిన పనులు ముందుకు సాగకపోవడంతో అధికారుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బ్రిడ్జి పగుళ్లను గమనించిన గ్రామ సర్పంచ్ పంజాల ప్రమీల జగన్మోహన్ గౌడ్ అధికారులు ఉద్దేశించి మాట్లాడుతూ.. బ్రిడ్జి ఏ క్షణంలో కూలిపోతుందో తెలియదు. కావున అధికారులు యుద్ధ ప్రతిపాదికన పనులు చేపట్టాలని కోరారు.


Next Story

Most Viewed