ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోండి.. డీఈఓకు వినతి

by Disha Web Desk 13 |
ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోండి.. డీఈఓకు వినతి
X

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల డీఈఓ రాధాకిషన్‌కు వినతిపత్రం అందజేశారు. ఏబీవీపీ జిల్లా కన్వీనర్ నాగరాజు మాట్లాడుతూ.. ఎల్లారెడ్డిపేట మండలం విజ్ఞాన్ స్కూల్ బస్సు ప్రమాద ఘటనపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే జిల్లాలో ఫిట్‌నెస్ లేని బస్సులో పరిమితికి మించి విద్యార్థులను యాదేచ్చగా నడుపుతున్నా.. రవాణా శాఖ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. నిద్ర మత్తులో ఉన్న అధికారులు.. వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఎలాంటి చర్యలు తీసుకోకపోతే డీటీఓ కార్యలయ ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ మారావేణి రంజిత్, జిల్లా కన్వీనర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.



Next Story