- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయం: పెద్దపల్లి ఏసీపీ మహేష్
దిశ, పెద్దపల్లి: శాంతి భద్రతల పరిరక్షణే పోలీసుల ధ్యేయమని పెద్దపల్లి ఏసీపీ ఎడ్ల మహేష్ పేర్కొన్నారు. గురువారం పెద్దపల్లి ఏసీపీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మాట్లాడుతూ.. సబ్ డివిజన్ పరిధిలోని ప్రజలు సమస్యలు ఉంటే నేరుగా పోలీస్ స్టేషన్లో సంప్రదించాలన్నారు.
ప్రజాస్వామ్య పరిరక్షణలో పోలీసులకు ప్రజలు తమ వంతు సహకారం అందించాలన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేయడంతో పాటు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
గంజాయి విక్రయించినా నిల్వచేసిన, సరఫరా చేసిన చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవన్నారు. సమస్యలతో వచ్చే ప్రజలకు పరిష్కారం చూపాలన్నారు. ఎసీపీగా బాధ్యతలు స్వీకరించిన మహేష్ కు సీఐలు ప్రదీప్ కుమార్, ఇంద్రసేనారెడ్డి, అనిల్ కుమార్, ఎస్సైలు రాజేష్, ఉపేందర్, మహేందర్, శ్రీనివాస్, వెంకటకృష్ణ, రాజ వర్ధన్, మౌనిక, వినితా, రవీందర్ లతోపాటు సిబ్బంది పుష్పగుచ్చాలు, మొక్కలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.