మానసా దేవి సప్తమ వార్షికోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే కవంపల్లి

by Sumithra |
మానసా దేవి సప్తమ వార్షికోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే కవంపల్లి
X

దిశ, గన్నేరువరం : మండలంలోని కాసింపేట సుప్రసిద్ధ స్వయం భూ మానసా దేవి మహా క్షేత్రంలో సప్తమ వార్షికోత్సవ వేడుకలు రెండో రోజు ఘనంగా సాగాయి. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు జరిపించిన అనంతరం పూజారులు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. వేడుకల్లో భాగంగా రెండో రోజు సామూహిక కుంకుమ పూజ, చండీ హోమం, అగ్ని భగవానుని విగ్రహ ప్రతిష్ట లక్షపూలతో అమ్మవారికి అభిషేకం నిర్వహించారు.

శుక్రవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తుల సౌకర్యార్థం అనేక ఏర్పాట్లు చేశారు. భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు ఏలేటి చంద్రారెడ్డి, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు ముసుకు ఉపేందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు అల్లూరి శ్రీనాథ్ రెడ్డి, కొమ్మెర రవీందర్ రెడ్డి, చిటుకూరి అనంతరెడ్డి, బద్దం సంపత్ రెడ్డి, మాతంగి అనిల్, ఒడ్నాల నరసయ్య, దుడ్డు మల్లేశం అధిక సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు, భక్తులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed