- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
బిగ్ ట్విస్ట్ ఇచ్చిన కార్పొరేటర్.. పోలీసులకు లొంగిపోయిన గంగుల అనుచరుడు
దిశ, కరీంనగర్ బ్యూరో: పలు భూ కబ్జాలు, బెదిరింపులు, వసూళ్ల ఆరోపణల నేపథ్యంలో గత నాలుగు రోజులుగా అజ్ఞాతంలో ఉన్న కార్పొరేట్ జంగిలి సాగర్ ఎట్టకేలకు పోలీసుల ముందు లోంగిపోయాడు. పోలీసు శాఖలో ఉన్న పరిచయాలతో కరీంనగర్ కు చెందిన ఓ పోలీసు అధికారి ద్వారా మద్యవర్తిత్వంలో పోలీసులకు లొంగిపోయినట్లు విశ్వసనీయ సమాచారం. కాగా గత నాలుగు రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లిన జంగిలి సాగర్ కోర్టు ను ఆశ్రయిస్తున్నట్లు పుకార్లు షికార్లు చేశారు. కానీ సాగర్ మాత్రం తనకు ఉన్న పోలీసు పరిచయాలు, పోలీస్ అదికారులతో ఉన్న సాన్నిహిత్య సంబంధంతో మద్యవర్తిత్వం చేసి అరెస్టు చేయకుండా తానే స్వయంగా లొంగిపోయి పోలీసు ఉన్నతాధికారులకు ట్విస్ట్ ఇచ్చాడు.
కరీంనగర్ పోలీసులు భూ కబ్జాదారులను వేటాడే ప్రక్రియ వేగవంతం గా సాగుతున్న తరుణంలో సాగర్ లోంగుబాటు ఇప్పుడు కరీంనగర్ జిల్లాలో చర్చానీయాంశంగా మారింది. కానీ సాగర్ బాధితుల్లో మాత్రం ఆందోళన నెలకొంది. గతంలో తన అదికార దర్పంతో పలు ఆరోపణలను కప్పిపుచ్చి అక్రమాలకు పాల్పడిన సాగర్ ఇప్పుడు మళ్లీ పోలీసు అదికారుల ద్వారా లొంగిపోవడం పై బాధితులు తమకు న్యాయం జరుగుతుందా అనే సందేహం వ్యక్తం పరుస్తున్నారు. పోలీసు అధికారులు అరెస్టుతో సరిపుచ్చకుండా పూర్తిస్థాయి విచారణ చేస్తే వాస్తవాలు వెలుగులోకి వచ్చి బాధితులకు న్యాయం జరుగుతుందని బాధితులు పోలీసు ఉన్నతాధికారులను వేడుకుంటున్నారు.