ఆదివారం జగిత్యాలలో మంత్రి దామోదర రాజనర్సింహ పర్యటన

by Kalyani |
ఆదివారం జగిత్యాలలో మంత్రి దామోదర రాజనర్సింహ పర్యటన
X

దిశ, జగిత్యాల రూరల్: రేపు(ఆదివారం) రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ జగిత్యాల జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు శనివారం మెడికల్ కాలేజీ గెస్ట్ హౌస్ లో విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంత్రి పర్యటన వివరాలు వెల్లడించారు. శనివారం రాత్రి ధర్మపురికి చేరుకొనున్న మంత్రి అక్కడే బస చేస్తారని ఆదివారం ఉదయం జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శిస్తారని వెల్లడించారు. అనంతరం కలెక్టరేట్ కార్యాలయంలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో ఏర్పాటు చేసిన రివ్యూ మీటింగ్ లో పాల్గొంటారని తెలిపారు. మరోవైపు సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఎస్సీ వర్గీకరణ విషయంలో శాసనసభలో దామోదర రాజనర్సింహ కీలకంగా వ్యవహరించారని విప్ గుర్తు చేశారు. మరోవైపు భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఇండియన్ ఆర్మీకి కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పాటు యావత్ భారత ప్రజలు అండగా ఉన్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed