- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
లంచాలు తీసుకునే సన్నాసి రవి శంకర్.. మూడేళ్ళలో వందల కోట్లు ఎలా వచ్చాయి: మేడిపల్లి
దిశ, మల్యాల: చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్ నియోజకవర్గాన్ని దోచుకుతినేందుకే ఎమ్మెల్యే పదవిని అడ్డుపెట్టుకుని పబ్బం గడుపుతున్నాడని చొప్పదండి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మేడిపెల్లి సత్యం అన్నారు. బుధవారం గంగాధర మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సత్యం మాట్లాడుతూ.. స్థానిక ఎమ్మెల్యే రవిశంకర్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పోస్టింగులు ఇచ్చేందుకు కమిషన్లు తీసుకునే సన్నాసి అని ఎమ్మెల్యే పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల అఫిడవిట్లో చూపిన ఆస్తులకు ఇప్పుడు ఉన్న ఆస్తులకు మధ్య తేడా గమనిస్తే ఆయన అక్రమార్జన ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతుందని అన్నారు. మూడేళ్ల కాలంలో వందల కోట్ల ఆస్తులు ఎలా సంపాదించారో చెప్పాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే రవి శంకర్కు సంబంధించిన పలు ఆస్తుల వివరాలను విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అవినీతి చేయడంలో ముందు వరుసలో ఉన్న ఎమ్మెల్యేకు జీవన్ రెడ్డి లాంటి మచ్చలేని మనుషులను విమర్శించే నైతిక హక్కు లేదని అన్నారు. జీవన్ రెడ్డికి బహిరంగ క్షమాపణ చెప్పాలని లేకపోతే రాబోయే ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. త్వరలోనే చొప్పదండి ఎమ్మెల్యే అక్రమాస్తుల చిట్టా బయటపెడతామని తెలిపారు.