ఢిల్లీ ఓబీసీ జనగణన మహా దీక్షలో జిల్లా బీసీ నాయకులు

by Dishanational1 |
ఢిల్లీ ఓబీసీ జనగణన మహా దీక్షలో జిల్లా బీసీ నాయకులు
X

దిశ, కరీంనగర్: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఓబీసీల జనగణన చేపట్టాలని గురువారం దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో కరీంనగర్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నాగుల కనకయ్య, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రాచమల్ల రాజు, ప్రధాన కార్యదర్శి దొగ్గలి శ్రీధర్, రాష్ట్ర కార్యదర్శి జీఎస్ ఆనంద్, ఉపాధ్యక్షుడు రంగు సంపత్, విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు నారోజ రాకేష్ చారి, ప్రశాంత్, పిడుగు కృష్ణ పాల్గొన్నారు. జాజుల శ్రీనివాస్ మాట్లాడుతూ దేశంలో చేపట్టే జాతీయ జనగణన, ఓబీసీ కుల గణన చేపట్టాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. జనాభా దామాషా ప్రకారం చట్ట సభల్లో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్రం ప్రత్యేక ఓబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, క్రిమిలేయర్ విధానాన్ని రద్దుచేయాలని కోరారు. దేశంలో ఓబీసీ రిజర్వేషన్లను 27 శాతం నుండి 50 శాతంకు పెంచాలని డిమాండ్ చేశారు.


Next Story

Most Viewed