- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
'కేసీఆర్ యువతను మోసం చేస్తూ.. ఓట్లు దండుకుంటున్నాడు'
దిశ, శంకరపట్నం: రాష్ట్రంలో కేసీఆర్ యువతను మోసం చేస్తూ.. ఓట్లు దండుకుంటున్నాడని సీపీఐ జిల్లా కార్యదర్శి వెంకటస్వామి మండిపడ్డారు. శుక్రవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెంకటస్వామి మాట్లాడారు. నీళ్లు, నియామకాలు అనే నిదానం తో పోరాటం చేసి తెలంగాణ సాధించుకుంటే ఇంతవరకు యువతకు ఉద్యోగాలు లేవు, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలం చెందారని ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చే విధంగా బడ్జెట్ ప్రవేశపెట్టారని విమర్శించారు. తెలంగాణలో యువతకు ఉద్యోగాలు లేవు, రెండు సార్లు ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ యువతకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేదన్నారు. యువతకు నిరుద్యోగ భృతి అందిస్తామని నేటికీ అందించలేదని.. రైతులకు రుణమాఫీ చేయడం లేదని, అర్హులైన వారికి తెల్ల రేషన్ కార్డులు అందించడం లేదు, ఆసరా పెన్షన్, వికలాంగుల పెన్షన్లు కూడా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మండల కార్యదర్శి పిట్టల సమ్మయ్య, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.