సీఎం టూర్‌కు ముందే అపశృతి.. గుండె పోటుతో పీసీ మృతి

by Dishanational1 |
సీఎం టూర్‌కు ముందే అపశృతి.. గుండె పోటుతో పీసీ మృతి
X

దిశ, జగిత్యాల ప్రతినిధి: సీఎం టూర్ కు ముందే జగిత్యాలలో అపశృతి చోటుచేసుకుంది. సీఎం కేసీఆర్ జగిత్యాల పర్యటనలో భాగంగా బందోబస్తుకు వచ్చిన కానిస్టేబుల్ గుండె నొప్పితో మృతిచెందాడు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న కానిస్టేబుల్ పరుశురాం డ్యూటీలో అస్వస్థతకు గురై గుండెలో నొప్పిగా ఉందంటూ పోలీస్ స్టేషన్ కు వచ్చి పడిపోగా గమనించిన తోటి సిబ్బంది హుటాహుటిన అంబులెన్స్ లో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మృతి చెందాడు.



Next Story

Most Viewed