- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
గత పాలకులు పోగొట్టిన వారసత్వ ఉద్యోగాలు ఇచ్చింది బీఆర్ఎస్: కొప్పుల ఈశ్వర్
దిశ,గోదావరిఖని: గత పాలకులు పోగొట్టిన వారసత్వ ఉద్యోగాలు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమని మాజీ మంత్రి, పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. సోమవారం గోదావరిఖని 2 ఇంక్లైన్ బొగ్గు గనిపై ప్రచారం చేశారు. ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం అనేకం చేసిందన్నారు. అబద్ధపు ప్రచారాలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, నాలుగు నెలల్లోనే కాంగ్రెస్ వైఖరి ప్రజలు, సింగరేణి కార్మికులకు అర్థం అయిందన్నారు. తెలంగాణ అస్తిత్వం కోసం పోరాడే ఒకే పార్టీ బీఆర్ఎస్ అన్నారు. ఆగర్భ శ్రీమంతుడు, భూ గర్భ కార్మికునికి ఎన్నికలు జరుగుతున్నాయని, వీకెండ్ లో వచ్చి పొయే కాంగ్రెస్, బీజేపీకి ఓటు వేయద్దన్నారు. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి సింగరేణి కార్మికుడిగా, కార్మిక నాయకుడిగా, ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన తనకు కార్మికుల కష్టాలు తెలుసని, తనను గెలిపిస్తే కార్మికులకు గతంలో అందుబాటులో ఉన్నా, ఇప్పుడు, ఎప్పుడు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.