అంగరంగ వైభవంగా మత్స్య గిరింద్ర స్వామి బ్రహ్మోత్సవాలు

by Disha Web Desk 12 |
అంగరంగ వైభవంగా మత్స్య గిరింద్ర స్వామి బ్రహ్మోత్సవాలు
X

దిశ, శంకరపట్నం: అంగరంగ వైభవంగా శ్రీ మత్స్య గిరింద్ర స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టు గ్రామంలోని గుట్టపై గల శ్రీ మత్స్య గిరింద్ర స్వామి 20 23 బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఆలయ ప్రధాన అర్చకులు మేషం మురళీధర్ ఆచార్యులు, వేద పండితుల ఆధ్వర్యంలో ఆలయ దేవాదాయ, ధర్మాదాయ శాఖ, ధర్మకర్తల మండలి చైర్మన్ సాగి మలహల్ రావు, గ్రామ సర్పంచ్ మొకిరాల కిషన్ రావు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు తీగల సంపత్, కోరెం తిరుపతిరెడ్డి, మాడ తిరుపతి రెడ్డి, కాసు తిరుపతి, ఉమ్మెంతల సుగుణాకర్ రెడ్డి, రామగిరి సునీత, తెలుగు భక్తులు పాల్గొన్నారు.


Next Story